ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తనను పార్టీలోని ఒక వర్గం చంపడానికి ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు అధికమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ. కొండూరు మండల టీడీపీ అధ్యక్షుడు పీక్లా నాయక్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పీక్లా నాయక్ వ్యాఖ్యల వెనుక టీడీపీలోని ఒక వర్గం ఉందని, వారే తనను రాజకీయంగా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.









