పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గౌరవించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరిని విమర్శించారు. రాష్ట్రపతికి కనీసం నిలబడి గౌరవం ఇవ్వని వారు తమను విమర్శించడం సరికాదని ఆమె అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు తీసిన పాత ఫోటోలను షేర్ చేస్తూ మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ఫోటోలలో, రాష్ట్రపతి నిలబడి అవార్డు అందజేస్తుండగా, ప్రధాని మోదీ పక్కనే కూర్చుని ఉన్నట్లు కనిపించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
"భారత రాష్ట్రపతి, ఒక గిరిజన నాయకురాలిని గౌరవించని వ్యక్తి మీరు. మేము కాదు. ఆ ఫోటో చూడండి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిల్చుని అవార్డు ఇస్తుంటే.. ప్రధాని మోదీ గారు మాత్రం పక్కనే కూర్చుని ఉన్నారు. రాష్ట్రపతికి కనీసం నిలబడి గౌరవం ఇవ్వని వారు మమ్మల్ని విమర్శించడమా?" అని ఆమె పేర్కొన్నారు.









