కామారెడ్డి, జూలై 18
కామారెడ్డి పట్టణంలో జరిగిన రాబరీ కేసులో పరారీలో ఉన్న అనుమానితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని కామారెడ్డి టౌన్ పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
కామారెడ్డి పట్టణంలో నమోదైన రాబరీ కేసు దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్న అనుమానితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని కామారెడ్డి టౌన్ పోలీసులు ప్రకటించారు. పై ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.
సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపి దర్యాప్తుకు సహకరించాలని ప్రజలను కోరారు.
ఈ మేరకు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ నరహరి విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 8712686145, 8712574178, 8712525999, 8712525969.












