అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సంచలనం రేపిన బాలిక హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ మృతి చెందాడు. కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం లభ్యమైంది.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన బాలిక హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కులవర్ధన్ మృతదేహం కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో లభించింది. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











