గుజరాత్లోని పాటన్ జిల్లాలో అర్ధరాత్రి పోలీసులపై దాడి జరిగిన సంఘటన కలకలం రేపింది. ఈ కేసులో 18 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారిని నడిరోడ్డుపై ఫ్రాగ్ మార్చ్ చేయించారు. ఆలయ విరాళం వివాదమే ఈ ఘర్షణకు కారణమని తెలుస్తోంది.
గుజరాత్ రాష్ట్రంలోని పాటన్ జిల్లాలో మార్చి 15వ తేదీ రాత్రి పోలీసులపై జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కత్తులు, మారణాయుధాలతో పోలీసులపై దాడికి పాల్పడిన 18 మంది నిందితులను పాటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పాటన్ పట్టణంలో నడిరోడ్డుపై ఫ్రాగ్ మార్చ్ చేయించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పోలీసుల సమాచారం ప్రకారం, ఒక ఆలయానికి సంబంధించిన విరాళం విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. శాంతిభద్రతల పరిరక్షణకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై ఒక వర్గానికి చెందిన ముఠా మారణాయుధాలతో దాడికి పాల్పడింది. ఈ దాడితో పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీయాల్సి వచ్చిందని తెలిసింది.











