బహుళ స్థాయి మార్కెటింగ్ (MLM) పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యూ నెట్ సంస్థ కార్యాలయాలపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు నగరాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి.
హైదరాబాద్లోని ఆరు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్యూ నెట్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు 20 మంది నిందితులను గుర్తించినట్లు తెలిసింది. వీరిలో సంస్థ నిర్వాహకులు, కీలక భాగస్వాములు ఉన్నట్లు భావిస్తున్నారు. అక్రమంగా వసూలు చేసిన నిధులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.











