దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుళ్లకు పాల్పడటానికి లష్కరే తోయిబా (ఎల్ఈటీ) తీవ్రవాద సంస్థ భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర, ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు.
ఎర్రకోట సమీపంలోని చాందిని చౌక్ ప్రాంతంలో ఉన్న ఒక ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
లష్కరే తోయిబా సంస్థ, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ (IED)లను ఉపయోగించి పేలుళ్లకు ప్రయత్నించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు.











