ఆయుష్ వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ () 2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ () విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 51,482 మంది నమోదు చేసుకోగా, 49,864 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 27,711 మంది అర్హత సాధించారు.
ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ, యునానీ విభాగాల్లో పీజీ ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 104 నగరాల్లోని 205 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష జరిగింది. జైపూర్లోని ఒక కేంద్రానికి సంబంధించిన 49 మంది అభ్యర్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
విభాగాల వారీగా అర్హత సాధించినవారు
2026లో మొత్తం 27,711 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో ఆయుర్వేదంలో 19,920 మంది, హోమియోపతిలో 5,934 మంది, యునానీలో 1,425 మంది, సిద్ధలో 432 మంది అర్హత సాధించారు.











