ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి, టీటీడీ చైర్మన్ నియామకం వంటి అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా ఉద్యోగాల సంఖ్య, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై వచ్చిన ఆరోపణలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి.
శాసనమండలిలో ఉద్యోగాల కల్పనపై ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం చెబుతున్న గణాంకాలపై సందేహాలు వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుత వాస్తవ పరిస్థితుల మధ్య వ్యత్యాసం ఉందని ఆయన ఆరోపించారు. సీఎం, మంత్రి చెప్పిన ఉద్యోగాల సంఖ్యలో తేడా ఉండటంపై ఆయన ప్రశ్నించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి నియామకంపై ఎమ్మెల్సీలు భరత్, తూమాటి మాధవరావు, వరుదు కళ్యాణి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడిపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడాలని, హిందూ ధర్మాన్ని గౌరవించాలని వారు కోరారు.









