కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో రాంభౌ మల్గి ప్రభోధిని విద్యార్థులతో సమావేశమై, నాయకత్వం, పారదర్శక పాలన, దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో యువతరం బాధ్యతపై చర్చించారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో రాంభౌ మల్గి ప్రభోధిని విద్యార్థులతో సంభాషించారు. ఈ సమావేశంలో నాయకత్వం, పారదర్శక పాలన, దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో యువతరం పెరుగుతున్న బాధ్యతపై చర్చ జరిగినట్లు మంత్రి తన సామాజిక మాధ్యమ ఖాతాలో తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
విక్షిత్ భారత్ ఆశయాలను నెరవేర్చడంలో విద్యార్థుల పాత్రను గుర్తుచేసుకుంటూ, వారి నూతన ఆలోచనలు, దృక్పథాలను ఆలకించానని, అలాగే తన రాజకీయ ప్రస్థాన అనుభవాలను వారితో పంచుకున్నానని నడ్డా పేర్కొన్నారు.









