రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ తమ ఆరు మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు సీనియర్ నాయకులకు అవకాశం దక్కింది.
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితా ప్రకారం, తెలంగాణ నుండి సీనియర్ నాయకులు అభిషేక్ మను సింఘ్వీ, వేమ్ నరేందర్ రెడ్డిలను రాజ్యసభకు నామినేట్ చేశారు. వీరిద్దరూ తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఛత్తీస్గఢ్ నుంచి ఫూలో దేవి నేతమ్, హర్యానా నుంచి కరంవీర్ సింగ్ బౌధ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మ, తమిళనాడు నుంచి ఎం. క్రిస్టోఫర్ తిలక్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.









