కడప నగరంలోని 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి తన సొంత భూమిని అక్రమంగా కబ్జా చేశారని, అధికారుల స్పందన లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.
సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, తన భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేశారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని కార్పొరేటర్ ఉమాదేవి తెలిపారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రభుత్వ పనితీరుపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. 'తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక కార్పొరేటర్ భూమికే రక్షణ లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు' అని ఆమె వ్యాఖ్యానించారు. తమకే రక్షణ లేనప్పుడు, ప్రజల వద్దకు వెళ్లి వారికి భరోసా ఎలా కల్పించగలమని ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచారు.










