ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరోరా కళాశాల, శిశు మందిర్ పాఠశాల భూముల వివాదం కామారెడ్డిలో రాజకీయ ఘర్షణకు దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణం వేడెక్కింది.
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నాయకులకు చర్చకు రావాలని సవాల్ విసరడంతో, వారు శనివారం ఆయన క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ నిరసన సమయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పి, కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని తెలిసింది.










