పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజీనగర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి రబియుల్ ఆలం చౌధురి తొలుత తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
తన కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారిపై ఒత్తిళ్లు, ఎన్నికల గుర్తు విషయంలో ఎదురవుతున్న సమస్యల కారణంగానే పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు రబియుల్ తొలుత తెలిపారు. తక్కువ సమయంలో కొత్త ఎన్నికల గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అయితే, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో మాట్లాడిన అనంతరం రబియుల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పోలీసుల నుంచి తనకు, పార్టీ కార్యకర్తలకు భద్రత కల్పిస్తామని హామీ లభించిందని తెలిపారు. మమతా బెనర్జీ కూడా ఎన్నికల బరిలో కొనసాగాలని సూచించారని ఆయన వెల్లడించారు. దీంతో తాను ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.











