తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి తరచుగా వస్తున్నారని విమర్శించారు. ఈ పర్యటనల వల్ల ప్రతిపక్ష కూటమి (NDA) లో ఆందోళనలు మొదలయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, "నేను ప్రజల కోసం శక్తికి మించి పని చేస్తున్నాను. మాకు ఓటు వేసిన వారికే కాకుండా, వేయని వారికి కూడా పని చేస్తున్నాను. కానీ కొందరు నాయకులు ఎన్నికల సమయంలోనే కనిపిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడే రాష్ట్రం చుట్టూ తిరుగుతారు," అని ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికల కోసమే ఈ పర్యటనలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రధాని మోదీ ఎన్నిసార్లు పర్యటిస్తే, అంత భారీ స్థాయిలో ఎన్డీయే ఓటమి పాలవుతుందని వారి సొంత కూటమి పార్టీలే భయపడుతున్నాయని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలను 'తమిళనాడు వర్సెస్ ఎన్డీయే' మధ్య పోరాటంగా ఆయన అభివర్ణించారు. "తమిళనాడును సెయింట్ జార్జ్ కోట (చెన్నై) నుండి పాలించాలి కానీ, ఢిల్లీ నుండి కాదు," అని ఆయన స్పష్టం చేశారు.









