తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయంపై ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రియాంక గాంధీతో సమావేశమై ఎన్నికల ఫలితాలపై చర్చించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఇరువురు చర్చించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయానికి ప్రజలే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.












