కర్నూలు, జూన్ 30
కర్నూలు జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు నిజాయితీ, అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందిన 13 మంది పోలీసు అధికారులను కర్నూలు పోలీసు శాఖ ఘనంగా సన్మానించింది. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది.
విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన పోలీసు అధికారులకు ఘన సన్మానం జరిగింది. కర్నూలు జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం నిజాయితీతో, అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందిన 13 మంది పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా సన్మానించారు.
కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ లు ఈ సన్మానాన్ని నిర్వహించారు. పదవీ విరమణ పొందిన అధికారులను శాలువా, పూలమాలలతో సన్మానించి, జ్ఞాపికను అందజేసి వారి సేవలను కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా మాట్లాడుతూ, పోలీసు శాఖతో తమ అనుబంధం ఎల్లప్పుడూ కొనసాగుతుందని తెలిపారు. పదవీ విరమణ తర్వాత కూడా ఏవైనా సమస్యలు ఎదురైతే ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ని సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు.












