ఈ కేటగిరీలో తాజా వార్తలు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పోలీసులు వినూత్న ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందిరాచౌక్ వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్ను వినాయక మండపంగా మార్చి, ట్రాఫిక్ వినాయకుడును ఏర్పాటు చేశారు. భక్తి మార్గంలో ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.


















