కామారెడ్డి, జూలై 24
నకిలీ పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మోసాన్ని దేవునిపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. కాకతీయ నగర్ కాలనీలోని ప్లాట్ను అక్రమంగా విక్రయించేందుకు బండారి శ్రీనివాస్ రెడ్డి కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.
నకిలీ పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మోసాన్ని దేవునిపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు.
దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైం నెం.316/2025పై దర్యాప్తులో, కాకతీయ నగర్ కాలనీలోని ప్లాట్ను అక్రమంగా విక్రయించేందుకు బండారి శ్రీనివాస్ రెడ్డి కుట్ర పన్నినట్లు తేలింది. తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా చూపించి, తన మామ సంగారెడ్డిని అసలు యజమానిగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో హాజరుపరిచి నకిలీ గుర్తింపు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు.
అనంతరం అదే స్థలాన్ని అసలు విషయాన్ని దాచిపెట్టి ఇతరులకు విక్రయించగా, ఆ భూమి పలువురి పేర్లకు వరుసగా రిజిస్ట్రేషన్ అయినట్లు వెల్లడైంది. ప్రధాన నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.










